ట్రస్ట్ పత్రికలో ప్రధాని మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు
ABN , First Publish Date - 2020-08-03T18:29:52+05:30 IST
ఆగస్టు 5 న జరగబోయే అమోధ్య భూమిపూజ నిమిత్తమై ట్రస్ట్ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం అధికారికంగా
లక్నో : ఆగస్టు 5 న జరగబోయే అమోధ్య భూమిపూజ నిమిత్తమై తయారు చేసిన ఆహ్వాన పత్రికలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లున్నాయి. అందులో మొట్ట మొదటి పేరు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ తర్వాత విశిష్ట అతిథి హోదాలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్రావు భాగవత్ పేరుంది. ఆ తర్వాత గవర్నర్ ఆనందీబేన్ పటేల్ పేరు, సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు ఉంది. ఈ పేర్ల తర్వాత ముహూర్తాన్ని పేర్కొన్నారు. ఈ వివరణ అంతా పూర్తైన తర్వాత చివరగా ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ నృత్య గోపాల్ దాస్ పేరును పేర్కొన్నారు.