కొవిడ్‌-19 వ్యాప్తిపై ఇంటింటా సర్వే

ABN , First Publish Date - 2020-06-02T09:26:51+05:30 IST

గ్రామాల్లో కొవిడ్‌-19 ఐదో విడత సర్వే వలం టీర్లు, ఆశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు

కొవిడ్‌-19 వ్యాప్తిపై ఇంటింటా సర్వే

యలమంచిలి, జూన్‌ 1: గ్రామాల్లో కొవిడ్‌-19 ఐదో విడత సర్వే వలం టీర్లు, ఆశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి నమోదు చేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి న వారి వివరాలను తక్షణమే తమకు కానీ, ఆరోగ్య సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు.


కరోనా వ్యాప్తిపై అధికారుల విచారణ

వీరవాసరం: వీరవాసరంలో కరోనా అనుమానిత కేసులు వెలుగు చూడడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారి గోవర్థన్‌ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నుంచి సోమవారం సమాచారాన్ని తెలుసుకున్నారు. అనుమానిత వ్యక్తి ఏ ప్రాంతానికి చెందనివా రు, కరోనా ఎలా సోకింది, ఎక్కడ సంచరించారు వంటి సమాచారాన్ని తెలుసుకున్నారు. పీహెచ్‌సీ వైద్యాధికారి బి.నాగనందిని, సిబ్బంది పాల్గొన్నారు.


రెడ్‌జోన్‌ ప్రాంతాన్ని సందర్శించిన డీఎస్పీ

నరసాపురం రూరల్: మండలంలోని ఎల్‌బీ.చర్ల, మోడి గ్రామాలలో డీఎస్పీ నాగేశ్వరరావు సోమవారం పర్యటించారు. రెండు రోజుల క్రితం మోడి గ్రామంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం విదితమే. దీంతో అధికారులు ఈ ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. రెడ్‌జోన్‌లోకి ఎవరూ వెళ్లకుండా మూసివేయాలని, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సీఐ కృష్ణమోహన్‌, ఎస్‌ఐలు ప్రియకుమార్‌, హరి ఉన్నారు.

Updated Date - 2020-06-02T09:26:51+05:30 IST