పీవీ జీవితంపై రచనలకు ఆహ్వానం
ABN , First Publish Date - 2020-07-09T11:12:47+05:30 IST
దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జీవితంపై ప్రత్యేక సంచిక కోసం రచనలను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ ..
పర్వతగిరి, జూలై 8: దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జీవితంపై ప్రత్యేక సంచిక కోసం రచనలను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర కమిటీ బాధ్యులు కామిడి సతీ్షరెడ్డి, రావుల రాజేష్, మేకిరి దామోదర్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘పీవీతో నా బంధం-అనుబంధం’, ‘మన అందరి మార్గదర్శకుడు- పీవీ మహాశయుడు’ అనే అంశంపై కవిత అయితే 16లైన్లకు మించకుండా, వ్యాసం అయితే రెండు పేజీలకు మించకుండా ఈనెల 20లోపు పంపాలని సూచించారు. వివరాలకు 9848445134 ఫోన్ నెంబరులో సంప్రదించాలని వారు కోరారు.