శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వనం
ABN , First Publish Date - 2020-10-16T06:15:30+05:30 IST
అలంపూర్ క్షేత్రంలో ఈ నెల 17 నుంచి జరగనున్న జోగుళాంబదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు దేవాదాయశాఖ మంత్రి
అలంపూర్, అక్టోబరు 15 : అలంపూర్ క్షేత్రంలో ఈ నెల 17 నుంచి జరగనున్న జోగుళాంబదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అర్చకసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్శర్మ, కమిటీ నాయకులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వారు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఉత్సవాలకు రావాలని కోరారు.