నవరాత్రి ఉత్సవాలకు కంచి పీఠాధిపతికి ఆహ్వానం

ABN , First Publish Date - 2021-09-17T05:28:51+05:30 IST

కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో అక్టోబరు 7 నుంచి 14 తేదీ (దసరా)వరకు అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించనున్నారు.

నవరాత్రి ఉత్సవాలకు కంచి పీఠాధిపతికి ఆహ్వానం
కంచి పీఠాధిపతికి ఆహ్వానపత్రికను అందజేస్తున్న సభ్యులు

వర్గల్‌, సెప్టెంబరు 16: కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో అక్టోబరు 7 నుంచి 14 తేదీ (దసరా)వరకు  అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ  ఉత్సవాలకు రావాలని ఆలయ కమిటీ సభ్యులు గురువారం కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీకి ఆహ్వానపత్రికను అందజేశారు. ఆహ్వానించినవారిలో కంచి పీఠం ప్రతినిధి జయశంకర్‌ బాలగోపాల్‌, విద్యాధరి ఆలయ కమిటీ సభ్యులు దాచేపల్లి వెంకటకృష్ణ, గంగిశెట్టి సుధాకర్‌, రేణుగుంట శ్రీనివాస్‌, ఉప్పల శ్రీనివాస్‌, తేల్కుంట్ల రమేశ్‌గుప్తా పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-17T05:28:51+05:30 IST