Scholarshipsకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-10-21T14:40:05+05:30 IST

విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు..

Scholarshipsకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10 వరకు చదువుతున్న (ప్రీమెట్రిక్‌) విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకురాలు విద్య తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ విద్యార్థులతో 2021-22 స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయించాలని హెచ్‌ఎంలకు సూచించారు. http://www.telangana.epas-s.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2021-10-21T14:40:05+05:30 IST