గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-07-04T10:39:56+05:30 IST

ఏపీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ గురుకుల పాఠశాలల కన్వీనర్‌ అడపాల

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు (వీఆర్సీ), జూలై 3 : ఏపీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ గురుకుల పాఠశాలల కన్వీనర్‌ అడపాల సాంబశివరావు తెలిపారు. విద్యార్థులు 1 సెప్టెంబరు 2009  నుంచి 31 ఆగస్టు 2011 మధ్య జన్మించి ఉండాలన్నారు. 2019-20 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పాసై ఉండాలని తెలిపారు. లాటరీ పద్ధతిలో ఎంపిక నిర్వహిస్తామని, పూర్తి వివరములకు 9701889873 నెంబరును సంప్రదించాలని కోరారు.

Updated Date - 2020-07-04T10:39:56+05:30 IST