క్రీడా పరికరాల సరఫరాకు టెండర్ల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-02-20T06:46:45+05:30 IST
జిల్లాలోని 456 ఉన్నత పాఠశాలలు, 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు క్రీడా పరికరాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం
ఏలూరు ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 19 : జిల్లాలోని 456 ఉన్నత పాఠశాలలు, 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు క్రీడా పరికరాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని డీఈవో సీ.వీ.రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా పరికరాల సరఫరాకు ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లను ఆహ్వానిస్తు న్నట్టు వివరించారు. గుర్తింపు కలిగిన సంస్థలు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఈనెల 26వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు వేసేందుకు గడువు ఉందన్నారు.