రైతునేస్తం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-08-11T09:12:09+05:30 IST

రైతునేస్తం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

రైతునేస్తం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ‘రైతు నేస్తం’ 18వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబరులో ఇచ్చే 2022 పురస్కారాల కోసం ఈ నెల 31లోగా దరఖాస్తులు పంపాలని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు కోరారు. వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు అగ్రి ఇన్నోవేషన్‌లో విశేష సేవలందించిన అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా అగ్రి జర్నలిస్టులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. రైతునేస్తం వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తును రైతునేస్తం చిరునామాకు పంపాలని ఆయన బుధవారం ఓ ప్రకటనలో కోరారు. 


Updated Date - 2022-08-11T09:12:09+05:30 IST