అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2022-08-09T05:38:50+05:30 IST
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గాంధారి, ఇందల్వాయి ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిన 2022-23 విద్యాసంవత్సరానికి అతిఽథి ఉపాధ్యాయ భర్తీకి దరఖాస్తుచేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు.
కామారెడ్డిటౌన్,ఆగస్టు 8: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గాంధారి, ఇందల్వాయి ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిన 2022-23 విద్యాసంవత్సరానికి అతిఽథి ఉపాధ్యాయ భర్తీకి దరఖాస్తుచేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈనెల 10 నుంచి 16 వరకు గాంధారి గురుకుల పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఈనెల 17న జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో డెమో తరగతులు నిర్వహించి పూర్తిమెరిట్ ఆధారంగా అతిథి ఉపాధ్యాయులను ఎంపికచేస్తామన్నారు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వబడునని తెలిపారు. ఎలాంటి కుల రిజర్వేషన్లు వర్తించవని తెలిపారు. ఇదివరకే పనిచేస్తున్న వారు సైతం ఎంపిక పరీక్షకు హాజరుకావాలన్నారు.