పేస్విఫ్‌లో చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌కు 70 శాతం వాటా

ABN , First Publish Date - 2022-01-20T06:23:17+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన పేస్విఫ్‌ టెక్నాలజీ్‌సలో మురుగప్ప గ్రూప్‌నకు చెందిన చోళమండలం ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ దాదాపు

పేస్విఫ్‌లో చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌కు 70 శాతం వాటా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన పేస్విఫ్‌ టెక్నాలజీ్‌సలో మురుగప్ప గ్రూప్‌నకు చెందిన చోళమండలం ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ దాదాపు 70 శాతం వాటా సొంతం చేసుకోనుంది. దాదాపు రూ.450 కోట్లను ఒకేసారి చెల్లించి లేదా దశల వారీగా చెల్లింపులు ద్వారా ఈ వాటాను తీసుకోనుంది. ఈ మేరకు పేస్వి్‌ఫతో వ్యూహాత్మక వాటా కొనుగోలు ఒప్పందాన్ని చోళమండలం  కుదుర్చుకుంది. వాటా కొనుగోలు అనంతరం చోళమండలం ఇన్వె్‌స్టమెంట్‌కు పేస్వైప్‌ అనుబంధ కంపెనీగా మారుతుంది. దేశం లో పీఓఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) సేవల కంపెనీలో పేస్విఫ్‌ ఒకటి. పేమెంట్‌ గేట్‌వే, ఈ-కామర్స్‌ సొల్యూషన్ల సేవలను కూడా పేస్విఫ్‌ అందిస్తోంది. సూపర్‌ మార్కెట్లు, మెడికల్‌ స్టోర్లు వంటి మధ్య, చిన్న తరహా మార్కెట్లలో 3 లక్షల మందికి పైగా పేస్వి్‌ఫకు ఖాతాదారులుగా ఉన్నారు. 

Updated Date - 2022-01-20T06:23:17+05:30 IST