సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-08-17T06:14:59+05:30 IST
విద్యార్థి నాయకులుగా ఎన్నిక కావడం ఎంత ముఖ్యమో, సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించడం అంతే ముఖ్యమని ఎస్పీ (సీఐడీ)కేజీవీ సరిత అన్నారు.
సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలి
నలంద విద్యానికేతన్ ఇన్వెస్టిచర్ సెర్మనీలో ఎస్పీ సరిత
గవర్నర్పేట, ఆగస్టు 16: విద్యార్థి నాయకులుగా ఎన్నిక కావడం ఎంత ముఖ్యమో, సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించడం అంతే ముఖ్యమని ఎస్పీ (సీఐడీ)కేజీవీ సరిత అన్నారు. నలంద విద్యానికేతన్లో మంగళవారం ఇన్వెస్టిచర్ సెర్మనీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి చేతుల మీదుగా విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేశారు. ఎన్నికైన హెడ్బాయ్, హెడ్ గర్ల్, హౌస్ కెప్టెన్, వైస్ కెప్టెన్, క్లాస్ మోనిటర్స్ తమ విధులను బాధ్యతతో సక్రమంగా నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ చేసిన ప్రతిజ్ఞకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, ఐక్యత, సోదరభావం, సంస్కృతిని కాపాడటం ఎంతో ముఖ్యమని అన్నారు. ఎస్సీసీ, దీక్ష, మైత్రి, సహన, తేజస్ హౌస్ విద్యార్థుల మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది, పిరమిడ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎస్సీసీ కల్నల్ (రిటైర్డ్) పి. రాంబాబు, నలంద విద్యానికేతన్ ప్రిన్సిపాల్ మాదల పద్మజ తదితరులు పాల్గొన్నారు.