భూ కబ్జాలపై విచారణ చేపట్టాలి

ABN , First Publish Date - 2022-08-17T05:48:35+05:30 IST

గాజువాకలోని సర్వే నంబర్‌-86, 274లో జరుగుతున్న భూ కబ్జాలపై సమగ్రమైన విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

భూ కబ్జాలపై విచారణ చేపట్టాలి
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలు

టీడీపీ ‘గాజువాక’ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌

గాజువాక, ఆగస్టు 16: గాజువాకలోని సర్వే నంబర్‌-86, 274లో జరుగుతున్న భూ కబ్జాలపై సమగ్రమైన విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. భూ కబ్జాలను నిరసిస్తూ మంగళవారం గాజువాక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచ్చలవిడిగా భూ కబ్జాలు జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయి చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.80 కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 65వ వార్డు అధ్యక్షుడు రట్టి వాసు, నాయకులు బైపిల్లి గాంధీ, కర్రి కృష్ణ, కదిరి పోలరాజు, సీతారామ్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-17T05:48:35+05:30 IST