వివేకా కేసులో దస్తగిరి దంపతుల విచారణ

ABN , First Publish Date - 2022-09-23T08:50:29+05:30 IST

వివేకా కేసులో దస్తగిరి దంపతుల విచారణ

వివేకా కేసులో దస్తగిరి దంపతుల విచారణ

పులివెందుల, సెప్టెంబరు 22: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. గురువారం సీబీఐ అధికారులు పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వచ్చారు. ఈ సందర్భంగా వివేకా మాజీ డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి, అతని భార్య షబానాను సీబీఐ అధికారులు విచారించారు. ఈ కేసులో మూడవ నిందితుడుగా ఉన్న షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారి కోర్టులో మెజిస్ర్టేట్‌ ముందు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఇతను చెప్పిన వివరాలే సీబీఐ అధికారుల విచారణకు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో దస్తగిరిని సీబీఐ అధికారులు మరోమారు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2022-09-23T08:50:29+05:30 IST