అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2021-08-29T02:16:55+05:30 IST
జిల్లాలో డీజిల్ను దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠాను
సూర్యాపేట: జిల్లాలో డీజిల్ను దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠాను మునగాల పోలీసులు అరెస్ట్ చేసారు. రాత్రి సమయంలో రోడ్డు వెంట ఆగి ఉన్న లారీల నుంచి ఈ ముఠా డీజిల్ దొంగతనం చేస్తున్నదని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా, తెరికాడ్కు చెందిన 6 గురు నిందితులలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రెండు లారీలు, 2 సెల్ ఫోన్లు, రూ.30వేల నగదు, డీజిల్ దొంగిలించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.