అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2022-02-27T02:27:22+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని లంబసింగి నుంచి సంగారెడ్డి వరకు డ్రగ్స్‌ను

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని లంబసింగి నుంచి సంగారెడ్డి వరకు డ్రగ్స్‌ను రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రాచకొండ SOT పోలీసులు రట్టు చేసినట్లు ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. తమకు అందిన పక్కా సమాచారంతో అబ్దుల్లా‌పూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పెట్ దగ్గర నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు. విహార యాత్రకు ఆంద్రప్రదేశ్‌లోని అరకు వెళ్లి అక్కడ గంజాయి ముఠా సభ్యులతో పరిచయం చేసుకున్నారన్నారు. అక్కడ తక్కువ ధర గంజాయి కొనుగోలు చేసుకొని హైదరాబాద్, సంగారెడ్డి పరిసర ప్రాంతాలలో ఎక్కువ ధరకు ఆమ్ముతున్నారని డీసీపీ తెలిపారు. వదిత్య ముఖేష్ (25), చౌహన్ శ్రీనివాస్ ( 23), రాథోడ్ నవీన్ ( 22), మరియు వదిత్య అనిల్ ( 22) అనే నలుగురు నిందితులను అరెస్ట్  చేశామన్నారు. వారి వద్ద నుంచి 32 లక్షల 52 వేల 500 విలువ జేసే 80 కేజీల గంజాయి, 4 సెల్ల్ ఫోన్, నగదు 2,500 రూపాయలు, బ్రిజా, స్విఫ్ట్ డిజైర్  రెండు కార్లని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని డీసీపీ పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-27T02:27:22+05:30 IST