ఇంటర్‌నెట్... ప్రాధమిక హక్కు... సరికొత్త క్యాంపెయిన్..

ABN , First Publish Date - 2021-05-07T01:38:34+05:30 IST

ఇంటర్‌నెట్‌ను ప్రాథమిక హక్కుగా మార్చాలన్న నినాదంతో కొన్ని సంస్థలు ‘అన్ మ్యూట్ ది వరల్డ్’ అనే క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నాయి.

ఇంటర్‌నెట్... ప్రాధమిక హక్కు... సరికొత్త క్యాంపెయిన్..

హైదరాబాద్ : ఇంటర్‌నెట్‌ను ప్రాథమిక హక్కుగా మార్చాలన్న నినాదంతో కొన్ని సంస్థలు ‘అన్ మ్యూట్ ది వరల్డ్’ అనే క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నాయి. గ్లోబల్ హెల్త్ సర్వీసెస్ (జీహెచ్ఎస్), వర్ట్.కామ్(వర్ట్.కాం) కలిసి తాజాగా ‘అన్‌మ్యూట్ ది వరల్డ్’ అనే కొత్త క్యాంపెయిన్‌ను ప్రారంహించాయి. ఇంటర్‌నెట్ సదుపాయాన్ని ప్రాథమిక మానవ హక్కుగా మార్చడమే ఈ క్యాంపెయిన్ ప్రధానోద్దేశమని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 


అప్పుడెప్పుడో... తొంభై ఏళ్ల క్రితం న్యూయార్క్‌లో తొలి వీడియో కాల్ నడిచింది. కానీప్పుడు పిల్లల క్లాసుల నుంచి ఆఫీస్ మీటింగ్స్ వరకూ... అంతా వర్చువల్ వరల్డ్ గా మారిపోయింది. అయితే ఈ రోజుల్లో కూడా కనీస ఇంటర్‌నెట్ సదుపాయాలు పొందలేని వాళ్లున్నారు. ప్రస్తుతం సంపన్న దేశాల్లో 87 % మంది ఇంటర్‌నెట్‌తో కమ్యూనికేట్ అవుతుండగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 47 % మంది కనెక్ట్ అయ్యారు. తక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో కేవలం 19 % మంది మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్నారు.


ఈ నేపధ్యంలో ఇంటర్‌నెట్ షర్ ఆల్ అన్న ప్రచారంలో దాతలు, ఫండర్స్, టెక్ కంపెనీలు, ఈవెంట్ నిర్వాహకులతో పాటు డిజిటల్ వరల్డ్ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనాలని క్యాంపెయిన్ నిర్వాహకులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-07T01:38:34+05:30 IST