తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం'

ABN , First Publish Date - 2021-03-09T23:36:05+05:30 IST

ఖతార్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' వేడుకలు ఘనంగా జరిగాయి.

తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం'

దోహా: ఖతార్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' వేడుకలు ఘనంగా జరిగాయి. మహమ్మారి కోవిడ్ నేపథ్యంలో ఈసారి జూమ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం కార్యదర్శి(రాజకీయ, సమాచార) పద్మ కర్రి, గౌరవ అతిథిగా ఐసీసీ అధ్యక్షుడు పీఎన్ బాబు రాజన్ హాజరయ్యారు. అలాగే ఐసీసీ జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్ బంధకవి, ఐసీబీఎఫ్ కోశాధికారి కుల్దీప్ కౌర్ బహల్, ఐసీబీఎఫ్ వైద్య సహాయ, శిబిరాల ఇంచార్జి రజనీ మూర్తి, విద్యావేత్త, సీనియర్ తెలుగు ప్రవాస నాయకులు ప్రసాద్ రావు కొడూరు, ఖతార్‌లో మహిళా సంఘం అధ్యక్షురాలు సుస్మితా పట్నాయక్ కూడా విశిష్ట అతిథులుగా హజరయ్యారు.


ఈ కార్యక్రమానికి తెలంగాణ నుండి వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొంది ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిన మహిళా విజేతలు అతిథి ప్రసంగం చేశారు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణా మాలావత్‌తో పాటు ఖతార్ రేడియో జాకీ, మీడియా నిపుణురాలు అను శర్మ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రాచీ వర్షిణీ, తెలంగాణ మొదటి లైన్ఉమన్ శిరిషా బబ్బూరి, రాష్ట్రంలో మొదటి మహిళా మెకానిక్ ఆదిలక్ష్మి, కువైట్ నుండి ఏకైక మహిళా ఎన్నారై వింగ్ ప్రెసిడెంట్ అభిలాషా గోడిశాల వక్తలుగా విచ్చేసి తోటి మహిళలకు స్ఫూర్తి నిచ్చేలా వారి ప్రయాణాన్ని, విశేషాల్ని పంచుకున్నారు.

 

విదేశాల్లో మన సాంప్రదాయం వస్త్రాధరణ అయినటువంటి  చీరను ప్రొత్సాహించి, ప్రచారాన్ని కల్పించాలనే సంకల్పంతో 'సంప్రదా, అన్ ఎక్సట్రార్డినరీ నారీ ఇన్ సారీ' అనే శీర్షికతో ఫ్యాషన్ షో నిర్వహించారు. కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా జూమ్ ద్వారా జరిగిన ఈ పోటీలో మహిళలు తమ ఇంటి నుండే ర్యాంప్‌ వాక్ చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ అధ్యక్షురాలు జ్యోతి ముద్దాం.. తెలంగాణ జాగృతి యూకే వైస్ ప్రెసిడెంట్, ప్రసిద్ధ విద్యావేత్త శారదా కల్యాణి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో టైటిల్ విన్నర్‌గా ప్రవీణ అక్కిరేడ్డి నిలిస్తే.. రాజేశ్వరి రుద్ర మొదటి రన్నరప్‌గా, ప్రవీణ టీ రెండవ రన్నర్‌గా నిలిచారు.


అనంతరం మనస్సు, ఆరోగ్యం పెంపొంది, ఒత్తిడి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ జాయ్ ఆఫ్ లివింగ్, మైండ్‌ఫుల్‌నెస్, హెల్త్ అండ్ న్యూట్రిషన్‌ వంటి అంశాలపై నిపుణులు హరికీర్తి గుడిపల్లి, డాక్టర్ అనుషా రెడ్డి, సైరాక్ష సుందరేషన్ వర్క్‌షాప్‌లు నిర్వహించారు. సంబరాల్లో సందర్భంగా రాజేష్ రంజని, చిన్నారి అక్షయ కంతేటి పాడి వినిపించిన స్తోత్రాలు.. మహిళల పరాశక్తి రూపాల్ని ఆవిష్కరిస్తూ చందన రెడ్డి, రేఖా పోసినా, గౌతమి మొరవనేని, సౌమ్య కంతేటి, తేజస్విని యాచమనేని, పాణ్య సాయివల్లి బృందం చేసిన నృత్యరూపకం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు హరికా ప్రేమ్, వంశీ సాయిగిరి, సుధ శ్రీరామోజు, స్వప్న కేసా, స్వప్న అల్లె, మమతా దుర్గాం, ప్రవీణ లక్ష్మి, ఇతర సభ్యులు హాజరయ్యారు.    



Updated Date - 2021-03-09T23:36:05+05:30 IST