15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు?

ABN , First Publish Date - 2022-02-22T13:06:23+05:30 IST

కరోనాతో దేశంలో 2020 మార్చి 23 నుంచి నిలిచిపోయిన సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసులు త్వరలోనే మళ్లీ ప్రా రంభం కానున్నాయి.

15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు?

రెండేళ్ల తర్వాత ప్రారంభం

కానున్న సాధారణ సర్వీసులు

న్యూఢిల్లీ: కరోనాతో దేశంలో 2020 మార్చి 23 నుంచి నిలిచిపోయిన సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసులు త్వరలోనే మళ్లీ ప్రా రంభం కానున్నాయి. రెండేళ్ల తర్వాత.. మార్చి 15 నుంచి ఇవి మొదలయ్యే అవకాశాలున్నాయ ని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై పౌర విమానయాన శాఖ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కాగా, దేశీయ విమానయానం పుంజుకుంటోందని.. రోజువారీ ప్రయాణికుల సంఖ్య వచ్చే రెండు నెలల్లో కొవిడ్‌ పూర్వస్థాయికి చేరుకుంటుందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. 

Updated Date - 2022-02-22T13:06:23+05:30 IST