జులైలో విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు: అమర్నాథ్‌

ABN , First Publish Date - 2022-05-15T22:49:09+05:30 IST

విశాఖ ఎయిర్‌ కనెక్టివిటీ, టూరిజంపై ఎయిర్ ట్రావెలర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్‌ మాట్లాడుతూ

జులైలో విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు: అమర్నాథ్‌

విశాఖ: విశాఖ ఎయిర్‌ కనెక్టివిటీ, టూరిజంపై ఎయిర్ ట్రావెలర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్‌ మాట్లాడుతూ మరిన్ని విమాన సర్వీసులు పెంచేలా ప్రభుత్వ సహకారం అందిస్తుందని తెలిపారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఏపీని షో కేస్‌ చేస్తామన్నారు. విశాఖలో బీచ్‌ ఐటీ నినాదంతో ఐటీ రంగం అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. త్వరలో శ్రీలంక, మలేషియాకు సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. జులైలో విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖ నుంచి భువనేశ్వర్‌, గోవాకు కొత్త సర్వీసులు, జులై నుంచి విశాఖ-కొలంబో విమాన సర్వీసు ప్రారంభిస్తామని అమర్నాథ్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-15T22:49:09+05:30 IST