16 నుంచి అంతర్జాతీయ ఈ-సమావేశం: ‘నన్నయ’ వీసీ

ABN , First Publish Date - 2020-12-06T05:52:55+05:30 IST

గిరిజన ప్రాంత విద్యార్థులకు సాంకేతిక, సమాంతర బోధనపై ఈనెల 16 నుంచి అంతర్జాతీయ ఈ-సమావేశం నిర్వహి స్తున్నట్టు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ మొక్కా జగన్నాథరావు తెలిపారు.

16 నుంచి అంతర్జాతీయ ఈ-సమావేశం: ‘నన్నయ’ వీసీ

దివానచెరువు, డిసెంబరు 5: గిరిజన ప్రాంత విద్యార్థులకు సాంకేతిక, సమాంతర బోధనపై ఈనెల 16 నుంచి అంతర్జాతీయ ఈ-సమావేశం నిర్వహి స్తున్నట్టు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ మొక్కా జగన్నాథరావు తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆయన శనివారం ఆవిష్కరించారు. నన్నయ విశ్వవిద్యాలయం విద్యాకళాశాల, విజయనగరం గిరిజన విశ్వవిద్యాల యం సంయుక్తంగా మూడురోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. మన రాష్ట్రంతోపాటు వివిధ దేశాలకు చెందిన అనుభవజ్ఞులైన అధ్యాపకులు పాల్గొంటారన్నారు. 


  • ఈ ఏడాదిలోనే ఐఎస్‌వో సర్టిఫికేషన సాధించాలి


 నన్నయ విశ్వవిద్యాలయానికి ఈ ఏడాదిలోనే ఐఎస్‌వో సర్టిఫికేషన సాధించేందుకు సిబ్బంది కృషి చేయాలని వీసీ జగన్నాథరావు అన్నారు. విశ్వవి ద్యాలయంలో జరిగిన ఐఎస్‌వో మేనేజ్‌మెంట్‌ సమీక్షా సమావేశంలో ఐఎస్‌వో కో-ఆర్డినేటర్‌ వి.పెర్సిస్‌ నివేదికను సమర్పించారు. వీసీ చైర్మనగా హాజరై మాట్లా డారు. రెండోదశ ఇంటర్నల్‌ ఆడిట్‌ ఈనెల 14, 15 తేదీల్లో నిర్వహించాలన్నారు. విశ్వవిద్యాలయ నాణ్యాతా ప్రమాణాలు తెలుసుకునేందుకు ఈ ఆడిట్‌ ఉపయో గపడుతుందన్నారు. ప్రతీ 6 నెలలకోసారి ఇంటర్నల్‌ ఆడిట్‌, మేనేజ్‌మెంట్‌ సమీక్ష జరపాలని చెప్పారు. సమావేశంలో మేనేజ్‌మెంట్‌ ప్రతినిధులుగా కె.శ్రీరమేష్‌, కేవీ స్వామి వ్యవహరించారు.

Updated Date - 2020-12-06T05:52:55+05:30 IST