నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ హాల్ టికెట్లు
ABN , First Publish Date - 2021-10-19T14:16:24+05:30 IST
ఇంటర్..
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ఇంటర్ ప్రథమ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు థియరీ పరీక్షలు ఈనెల 25 నుంచి నవంబరు 3 వరకు జరగనున్నాయని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ గుర్తుచేశారు. పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్టికెట్లో పేరు, ఫొటో, మీడియం, సంతకం, ఇతర వివరాలలో ఏమైనా తప్పులుంటే విద్యార్థులు వెంటనే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తేవాలని సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.