ఇంటర్ పరీక్ష రేపు
ABN , First Publish Date - 2022-05-24T05:55:15+05:30 IST
అసాని తుపాను కారణంగా మే 11వ తేదీన జరగాల్సిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష (25న) బుధవారం నిర్వహించనున్నట్లు ఆర్ఐవో శంకర్ నారాయణ సోమవారం తెలిపారు.
కర్నూలు(ఎడ్యుకేషన), మే 23: అసాని తుపాను కారణంగా మే 11వ తేదీన జరగాల్సిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష (25న) బుధవారం నిర్వహించనున్నట్లు ఆర్ఐవో శంకర్ నారాయణ సోమవారం తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించే గణితం, బోటనీ, సివిక్స్, ఒకేషనల్ సబ్జెక్టుల పరీక్ష యథావిధిగా కొనసాగుతుందన్నారు. పరీక్ష నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ టౌనమోడల్ కళాశాలలో ఇంటర్ మూల్యాంకనాన్ని 24, 25 తేదీల్లో నిలిపివేస్తున్నట్టు ఆర్ఐవో తెలిపారు. తిరిగి 26 నుంచి మూల్యాంకనం కొనసాగుతుందని ఆయన వివరించారు.