సీఎం పరిశీలనలో ఇంటర్‌ సప్లిమెంటరీ నిర్వహణ

ABN , First Publish Date - 2020-07-09T12:02:21+05:30 IST

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వాహణపై ప్రభుత్వం మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని..

సీఎం పరిశీలనలో ఇంటర్‌ సప్లిమెంటరీ నిర్వహణ

ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ 


ఆమనగల్లు : ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వాహణపై ప్రభుత్వం మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి, ఇంటర్‌ విద్యా కమిషనర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు సంబందించి ఫైల్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనలో ఉం దని తెలిపారు. ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఉమర్‌ జలీల్‌ పాల్గొన్నారు.


డీడీ లక్ష్మారెడ్డి, డీఐఈవో  సుధారాణి, మున్సిఫల్‌ కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌, ప్రిన్సిపాల్‌ అనసూయతో కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈనెల 10న మంత్రి సబితారెడ్డి ఆమనగల్లు పట్టణంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కమిషనర్‌ అధికారులతో సమీక్షించారు. అనంతరం మాడ్గుల రోడ్డులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణానికి కేటాయించిన భూమిని పరిశీలించారు. భూమి చుట్టూ కంచె ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2020-07-09T12:02:21+05:30 IST