ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-13T05:28:17+05:30 IST

నంద్యాలలోని ఎన్‌జీవో్‌స కాలనీలో ఇంటర్‌ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

నంద్యాల(నూనెపల్లె), ఏప్రిల్‌ 12: నంద్యాలలోని ఎన్‌జీవో్‌స కాలనీలో ఇంటర్‌ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమణయ్య కూతురు లిఖిత (17) విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఇటీవలే విద్యార్థిని  కళాశాల నుంచి ఇంటికి వచ్చింది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లిఖిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని టూటౌన్‌ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నం ద్యాల ప్రభుత్వాసుపత్రి మార్చురికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Updated Date - 2021-04-13T05:28:17+05:30 IST