రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-05-16T06:23:06+05:30 IST

మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి మృతి

తిరువూరు, మే 15: మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి మృతి చెందాడు. తిరువూరు  బోయకాలనీకి చెందిన నవీన్‌ తమ బంధువులకు నారాయణపురం గ్రామానికి  దారి చూపించేందుకు బైక్‌పై  పెద్దవరం వరకు వెళ్లి  తిరిగి ఇంటికి బయలుదేరాడు. మునుకుళ్ల శివాలయం వద్ద బైక్‌ను గేదె ఢీకొనడంతో నవీన్‌ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రస్తుతం నవీన్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నాడు. నవీన్‌ మృతదేహాన్ని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌తో పాటుగా పలువురు  టీడీపీ నాయకులు  సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2022-05-16T06:23:06+05:30 IST