అనకాపల్లి జిల్లాలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
ABN , First Publish Date - 2022-05-19T13:14:23+05:30 IST
జిల్లాలోని రావికమతం మండలం గుడ్డిప గ్రామంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది.
అనకాపల్లి: జిల్లాలోని రావికమతం మండలం గుడ్డిప గ్రామంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. జయశ్రీ అనే విద్యార్థిని ఈనెల 17న మాడుగుల ప్రభుత్వ కళాశాలలో పరీక్ష రాయటానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థిని తల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.