అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2021-08-03T23:35:21+05:30 IST
జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు
జోగులాంబ గద్వాల: జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్డేపల్లి మండలంలోని శాంతినగర్లో సురేష్ జువెలరీ షాప్ దొంగతనం కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి 11.50 లక్షల రూపాయల విలువైన 20 తులాల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు ఎస్పీ రంజన్ రతన్కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.