16 నుంచి ఇంటర్‌ ఆన్‌లైన్‌ తరగతులు

ABN , First Publish Date - 2021-06-12T05:52:17+05:30 IST

2021-22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈనెల 16 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తున్నట్టు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజ్‌ తెలిపారు.

16 నుంచి ఇంటర్‌ ఆన్‌లైన్‌ తరగతులు
కరపత్రాలు ఆవిష్కరిస్తున్న డీఐఈవో

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 11: 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈనెల 16 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తున్నట్టు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజ్‌ తెలిపారు. అ ధ్యాపకులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అడ్మిషన్లు, తరగతులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు నెలకొల్పడం జరిగిందని, ఆధునిక ప్రయోగశాల లు, లైబ్రరీ, కంప్యూటర్‌ తరగతుల నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై న విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లోనే అడ్మిషన్లు పొందాల ని ఆయన సూచించారు.

Updated Date - 2021-06-12T05:52:17+05:30 IST