ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
ABN , First Publish Date - 2021-10-26T05:40:49+05:30 IST
జిల్లాలో సోమవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 71పరీక్ష కేంద్రాలలో తొలిరోజు పరీక్ష ప్రశా ంతంగా జరిగింది.
తొలిరోజు పరీక్ష ప్రశాంతం
నిజామాబాద్ అర్బన్, అక్టోబరు 25: జిల్లాలో సోమవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 71పరీక్ష కేంద్రాలలో తొలిరోజు పరీక్ష ప్రశా ంతంగా జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మ ధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్-1 పరీక్షకు మొత్తం 19,009 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 17,732 మంది వి ద్యార్థులు హాజరయ్యారు. 1,277 మంది గైర్హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 16,796 మ ందికిగాను 15,713 మంది పరీక్ష రాయగా.. 1,013 మంది గైర్హాజరయ్యారు. 2,213 మంది ఒకేషనల్ విద్యార్థులకుగాను 19,49 మంది పరీక్ష రాయగా.. 264 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9గంటలకే పరీక్ష ఉండడంతో కొన్ని చోట్ల ఉదయం 7గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. డీఐఈవో రఘురాజ్ ఆరు పరీక్ష కేంద్రాలను, సిట్టి ంగ్స్క్వాడ్, హైపవర్ కమిటీ సభ్యులు ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.