కొనసాగిన ఎండ తీవ్రత

ABN , First Publish Date - 2021-03-04T09:02:30+05:30 IST

రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. ఆకాశం నిర్మలంగా వుండడంతో బుధవారం ఉదయం నుంచే ఎండ ఎక్కువగా ఉంది. మధ్యాహ్నానికి కొన్నిచోట్ల

కొనసాగిన ఎండ తీవ్రత

విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. ఆకాశం నిర్మలంగా వుండడంతో బుధవారం ఉదయం నుంచే ఎండ ఎక్కువగా ఉంది. మధ్యాహ్నానికి కొన్నిచోట్ల వేడిగాలులు వీచాయి. ఆరుబయట పనిచేసే వారంతా వేడి వాతావరణానికి ఉక్కిరిబిక్కిరయ్యారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలు, తుని, అమరావతిలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బంగాళాఖాతం, రాష్ట్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు లేకపోవడంతో సముద్రం నుంచి తేమగాలులు రావడం లేదని, దీంతో కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Updated Date - 2021-03-04T09:02:30+05:30 IST