ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ స్థల పరిశీలన

ABN , First Publish Date - 2020-08-10T11:21:17+05:30 IST

పలమనేరు సమీపంలోని కేటిల్‌ ఫారం వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ స్థలాన్ని ఆదివారం మార్కెట్‌ కమిటీ ఉన్నతాధికారులు, ఏఎంసీ ..

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ స్థల పరిశీలన

పలమనేరు, ఆగస్టు 9 : పలమనేరు సమీపంలోని కేటిల్‌ ఫారం వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ స్థలాన్ని ఆదివారం మార్కెట్‌ కమిటీ ఉన్నతాధికారులు, ఏఎంసీ చైర్మన్‌ ప్రహ్లాదతో కలిసి పరిశీలించారు. ఈ మార్కెట్‌ ఏర్పాటుకు  గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి అమరనాథరెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మారడంతో దీని నిర్మాణం అటకెక్కినట్లే అని అందరూ భావించారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటేగౌడ మార్కెట్‌ కమిటీ ఉన్నతాధికారులతో సంప్రదించి ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరడంతో వారు ఆదివారం వచ్చారు. మార్కెటింగ్‌ శాఖ గుంటూరు ఎస్‌ఈ శ్రీనివాస్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సుధాకర్‌, కడప ఏఈ వెంకటేశ్వరరావు, చిత్తూరు డీఈ హరినారాయణరెడ్డి.. ఏఎంసీ చైర్మన్‌ ప్రహ్లాద, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి జగదీష్‌తో ఈ స్థలంలో ఎక్కడెక్కడ ఏ ఏ భవనాలను నిర్మించాలో చర్చించారు.    


Updated Date - 2020-08-10T11:21:17+05:30 IST