టీఆర్‌ఎస్‌ హయాంలోనే సమగ్రాభివృద్ధి: ముత్తిరెడ్డి

ABN , First Publish Date - 2022-06-25T05:11:27+05:30 IST

టీఆర్‌ఎస్‌ హయాంలోనే పల్లెలు సమగ్రాభివృద్ధికి నోచుకున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌ హయాంలోనే సమగ్రాభివృద్ధి: ముత్తిరెడ్డి
గుర్జకుంటలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి

చేర్యాల, జూన్‌ 24: టీఆర్‌ఎస్‌ హయాంలోనే పల్లెలు సమగ్రాభివృద్ధికి నోచుకున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చేర్యాల మండలం గుర్జకుంటలో శుక్రవారం రైతువేదికను ప్రారంభించి, మహిళా సమాఖ్య భవన నిర్మాణం, బీసీ కమ్యూనిటీహాలు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణను సీఎం కేసీఆర్‌ తన పాలన కార్యదక్షతతో దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. ప్రతీ గడపకు అభివృద్ధిఫలాలు అందించిన ఘనత టీఆర్‌ఎ్‌సదేనన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించకుండా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ వెన్నంటే ఉండి టీఆర్‌ఎ్‌సకు శ్రీరామరక్షగా నిలుస్తారన్నారు. అనంతరం దళితబంధు లబ్ధిదారులకు మంజూరైన ట్రాక్టర్లు, వాహనాలను పంపిణీచేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, సర్పంచు పుర్మ మమతరాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుంకరి మల్లేశం, వైస్‌ చైర్మన్‌ పుర్మ వెంకట్‌రెడ్డి, రైతుసమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ తాడెం రంజిత, నాయకులు కిష్టయ్య, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.


 

Updated Date - 2022-06-25T05:11:27+05:30 IST