బీమా లేదా బ్యాంకింగ్... ఏది ప్రైవేటుపరం కానుంది ?

ABN , First Publish Date - 2021-02-24T00:09:14+05:30 IST

బ్యాంకుల మధ్య పోటీతత్వాన్ని పెంచి వాటిని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మరిన్ని సేవలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది.

బీమా లేదా బ్యాంకింగ్... ఏది ప్రైవేటుపరం కానుంది ?

న్యూఢిల్లీ : బ్యాంకుల మధ్య పోటీతత్వాన్ని పెంచి వాటిని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మరిన్ని సేవలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ నేపధ్యంలో పలు ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థలను ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకోనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకుల పేర్లు వెలుగులోకి రాగా, తాజాగా ఈ జాబితాలో ఓ బీమా కంపెనీ పేరు కూడా వినిపిస్తోంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


దేశంలో ఎల్‌ఐసీ తర్వాతి స్థానాల్లో ఉన్న ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలలో  ఒకదానిని ప్రైవేటీకరించే అవకాశలున్నట్లు సమాచారం. ఈ క్రమంలో... వీటి పేర్లను కూడా పరిగణలోకి తీసుకోబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో వినవస్తోంది. ఈ రెండు బీమా సంస్థల ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పటికే మూలధన సాయంతో మెరుగుపడిన నేపధ్యంలో... వీటిని ప్రైవేటీకరించే అవకాశముందని సమాచారం.


అంతేకాకుండా ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగుపరచేందుకుగాను ఈ త్రైమాసికంలోనే మరో రూ. 3 వేల కోట్ల మూలధన సాయాన్నందించే అవకాశమున్నట్లు వినవస్తోంది. ఈ రెండు సంస్థల్లో ఒకదానిని ప్రైవేటీకరించే ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లతో పాటు న్యూ ఇండియా ఇన్సురెన్స్సంస్థ కూడా ఈ జాబితాలో ఉన్నట్టు వినవస్తోంది. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముందని చెబుతున్నారు. 

Updated Date - 2021-02-24T00:09:14+05:30 IST