గాంధీ మాటలతో ప్రేరణ
ABN , First Publish Date - 2022-08-14T06:13:25+05:30 IST
దేశమంతా బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు పోరా టాలు చేస్తున్నారు.
వెంకటగిరిటౌన్, ఆగస్టు 13: దేశమంతా బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు పోరా టాలు చేస్తున్నారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ పిలుపుతో ప్రేరణపొంది ప్రభుత్వ ఉద్యో గాన్ని వదిలి స్వాతంత్య్ర సమరంలోకి అడుగు పెట్టారు చీళ్ల గురునాఽఽథం. గూడూరు డివిజన్లో కరపత్రాలను పంచుతున్నాడంటూ గురున్నా థంకు శిక్ష వేసి రాయ వేలూరు జైలుకు పంపారు. ఆ తరువాత సత్యా గ్రహం సమ యంలో ఆరు నెలల కారాగారం, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఒక సంవత్సరం పాటు ఆయన జైలు శిక్ష అనుభవించారు. అదే సమయంలో తొమ్మిదేళ్ల వయసు ఉన్న గురునాథం కుమార్తె సరోజనిదేవిని జెండా ఎగురవేసినందుకు బ్రిటీషు వారు అరెస్టు చేశారు. సహజంగా జానపద కవి కావడంతో రైతుల, దళితుల సంక్షేమం కోసం ప్రముఖ దళిత నాయకుడు కమతం షణ్ముగంతో కలిసి ఆయన పోరాటాలు సాగించారు. 1980 ఆగస్టు 24న సుమారు 70 ఏళ్ల వయస్సులో మృతిచెందారు.