రెండోరోజూ కొనసాగిన తనిఖీలు

ABN , First Publish Date - 2021-09-19T05:11:42+05:30 IST

రాజాం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ అధికారులు రెండో రోజూ శనివారం తనిఖీలు చేశారు. శుక్రవారం రాత్రి పొద్దు పోయే వరకూ తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. గత రెండేళ్లలో జరిగిన భూముల క్రయ విక్రయాలు, చలానాలు, ఇతర లావాదేవీలకు సంబంధించి రికార్డులను పరిశీ లించారు.

రెండోరోజూ కొనసాగిన తనిఖీలు

రాజాం రూరల్‌: రాజాం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ అధికారులు రెండో రోజూ శనివారం తనిఖీలు చేశారు. శుక్రవారం రాత్రి పొద్దు పోయే వరకూ తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. గత రెండేళ్లలో జరిగిన భూముల క్రయ విక్రయాలు, చలానాలు, ఇతర లావాదేవీలకు సంబంధించి రికార్డులను పరిశీ లించారు. ఇటీవల గడిముడిదాం చర్చి భూముల రిజిస్ట్రేషన్ల విషయంపై కూడా అధికారుల దృష్టి సారించినట్లు తెలిసింది. ఇదే వ్యవహారంలో పాలకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెండ్‌ అయిన నేప థ్యంలో చర్చి భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయా లేదా అనే అంశాన్ని లోతుగా పరిశీలించినట్లు సమాచారం. తనిఖీల నేపథ్యంలో శనివారం కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. వివరాలు వెల్లడించేందుకు తనిఖీ బృందం నిరాకరించింది. 

 

Updated Date - 2021-09-19T05:11:42+05:30 IST