మామడ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు
ABN , First Publish Date - 2022-08-13T07:45:57+05:30 IST
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల యంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఆఫీస్లోని పలు రికార్డుల పరిశీలన
మామడ, ఆగస్టు 12 : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల యంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాశిమెట్ల గ్రామంలోని సీలింగ్ భూములపై అక్రమ రిజిస్ర్టేషన్లు జరి గినట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేస్తున్నామన్నారు. ఆఫీస్లోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ విచారణ మూడు రోజుల పాటు కొనసాగుతుందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ భూములపై విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.