అర్బన్ పీహెచ్సీల తనిఖీ
ABN , First Publish Date - 2022-05-29T04:32:37+05:30 IST
రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో గల అర్బన్ పీహెచ్సీలను శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొండయ్య తనిఖీ చేశారు.
రాయచోటి టౌన్, మే 28: రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో గల అర్బన్ పీహెచ్సీలను శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొండయ్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని కొత్తపల్లె, ఎస్ఎన్కాలనీ, కొత్తపేట రామాపురం, వాల్మీకివీధిలలో గల అర్బన్ పీహెచ్సీలను తనిఖీ చేసి ఓపీ, క్లీనిక ల్ ల్యాబ్, ఫార్మసీ రికార్డులను పరిశీలించి బయోమెట్రిక్ హాజరుపై ఆరా తీశారు. అనంతరం ఆయన ఆయా అర్బన్ పీహెచ్సీలలో పనిచేస్తున్న సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రభుత్వం చేపడుతున్న అన్ని రకాల ఆరోగ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్రెడ్డి, డాక్టర్ విష్ణు, హెల్త్ ఎడ్యుకేటర్లు బలరామరాజు, వెంగల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.