స్కానింగ్ సెంటర్ల తనిఖీ
ABN , First Publish Date - 2022-08-19T05:17:10+05:30 IST
లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని ఏలూరు ఆర్డీవో పెంచల్ కిషోర్ అన్నారు.
ఏలూరు కలెక్టరేట్, ఆగస్టు 18 : లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని ఏలూరు ఆర్డీవో పెంచల్ కిషోర్ అన్నారు. గురువారం స్థానిక కమలసాయి ఇమేజింగ్ ల్యాబ్, జనని మెటర్నటీ ఆసుపత్రిని ఆర్డీవో ఆకస్మిక తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్లలో మిషన్లు రిజిస్టర్లో నమోదు, వాటి వరుస సంఖ్య, తయారీ కంపెనీల పేర్లను సరిపోల్చి చూశారు. స్కానింగ్ చేయించుకున్న గర్భిణుల నమోదు రిజిస్టర్ను, ఎన్నిసార్లు వరుసగా స్కానింగ్కు వచ్చింది, ఏదైనా ఎంటీపీ, గర్భవిచ్ఛిత్తి జరిగిందా అన్న కోణంలో తనిఖీలు నిర్వహించారు.