అత్తమామల వేధింపులను తట్టుకోలేకపోయిన అల్లుడు.. చివరకు ఎంత దారుణానికి పాల్పడ్డాడంటే..
ABN , First Publish Date - 2022-09-05T23:01:08+05:30 IST
అతను ఐదేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. మూడేళ్ల కూతురు కూడా ఉంది..
అతను ఐదేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. మూడేళ్ల కూతురు కూడా ఉంది.. అయితే కులాంతర వివాహం కావడంతో యువతి తల్లిదండ్రులు అల్లుడిని ఆదరించలేదు.. పైగా ఉద్యోగం కూడా చేయకుండా తమ కూతురి సంపాదన పైనే ఆధారపడుతున్నాడని తరచుగా అవమానించేవారు.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ వ్యక్తి ఆదివారం రాత్రి భార్యను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.. మధ్యప్రదేశ్ (Madhya pradesh)లోని ఇండోర్కు సమీపంలో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
Shocking: ఇద్దరు పిల్లల తండ్రితో ప్రేమలో పడిన మైనర్ బాలిక.. వారిద్దరూ కలిసి ఏం చేశారంటే..
ఇండోర్కు సమీపంలోని రౌ ప్రాంతానికి చెందిన సచిన్, మోహిని దంపతులు ఆదివారం రాత్రి మరణించారు. వీరిద్దరూ ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. అనాథ, వేరే కులానికి చెందిన సచిన్ను మోహిని తల్లిదండ్రులు ఆమోదించలేదు. పైగా పెళ్లైన నాటి నుంచి సచిన్కు సంపాదన లేదు. అత్తగారింట్లోనే ఉంటున్నాడు. మోహిని అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. దీంతో అల్లుడిని అత్తమమాలు తరచుగా అవమానించేవారు.
వారి మాటలను తట్టుకోలేకపోయిన సచిన్ కొన్ని నెలల క్రితం భార్య, కూతురిని తీసుకుని అదే ఊరిలో ఓ అద్దె ఇంటికి మారాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. తిరిగి పుట్టింటికి వెళ్లిపోవాలని మోహిని భావించి భర్తతో గొడవకు దిగేది. తీవ్ర మనస్థాపానికి గురైన సచిన్ ఆదివారం రాత్రి భార్యను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తను ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.