విద్యుత ప్రమాద ఘటనపై నేడు విచారణ

ABN , First Publish Date - 2022-07-01T05:59:11+05:30 IST

శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లి గ్రామ సమీపంలో జరిగిన విద్యుత ప్రమాద ఘటన పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు ఉమ్మడి జిల్లా విద్యుత శాఖ ఎస్‌ఈ నాగరాజు తెలిపారు.

విద్యుత ప్రమాద ఘటనపై నేడు విచారణ

అనంతపురంరూరల్‌, జూన 30 : శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లి గ్రామ సమీపంలో జరిగిన విద్యుత ప్రమాద ఘటన పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు ఉమ్మడి జిల్లా విద్యుత శాఖ ఎస్‌ఈ నాగరాజు తెలిపారు. ఆమేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఎస్పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు ప్లానింగ్‌ అండ్‌ ఎనర్జీ ఆడిట్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌హెచ రషీద్‌ను విచారణ అధికారిగా నియమించార న్నారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి  3గంటల వరకు తాడిమర్రి సెక్షన ఆఫీ్‌సలో విచారణ చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక్ష సాక్షులు, ఇతరులు జరిగిన సంఘన గురించి తెలియజేయాలని కోరారు. 


Updated Date - 2022-07-01T05:59:11+05:30 IST