గ్రామదీపిక అక్రమాలపై విచారణ

ABN , First Publish Date - 2021-10-19T05:06:02+05:30 IST

మండలంలోని టీఎల్‌పేట అంబేద్కర్‌నగర్‌ కాలనీకి చెందిన గ్రామదీపిక అక్రమాలపై సోమవారం జిల్లా అధికారులు విచారణ కొనసాగించారు.

గ్రామదీపిక అక్రమాలపై విచారణ
డ్వాక్రా మహిళలతో మాట్లాడుతున్న అడిషనల్‌ పీడీ జయశ్రీ

శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం

డీఆర్‌డీవో అడిషనల్‌ పీడీ జయశ్రీ

ఏన్కూరు, అక్టోబరు 18: మండలంలోని టీఎల్‌పేట అంబేద్కర్‌నగర్‌ కాలనీకి చెందిన గ్రామదీపిక అక్రమాలపై సోమవారం జిల్లా అధికారులు విచారణ కొనసాగించారు. అధికారుల ఎదుట డ్వాక్రా మహిళలు తమ గోడును వివరించారు. తాము స్త్రీనిధిలో ప్రతినెలా రుణాలు చెల్లిస్తున్నామని అయితే కొన్నినెలల నుంచి తాము సకాలంలో రుణాలు చెల్లిస్తున్నప్పటికీ గ్రామదీపిక ఆడబ్బులను బ్యాంకులో జమచేయకుండా సొంతానికి వాడుకుందని, ఆమెపై పూర్తిస్థాయి విచారణ జరిపి గ్రామదీపిక పదవి నుంచి తొలగించాలని డ్వాక్రా మహిళలు జిల్లా అధికారులను కోరారు. గ్రామదీపిక రూ.7.63లక్షలను సొంతానికి వాడుకొని జిల్లా నుంచి ఆడిట్‌ అధికారులు వస్తున్న సంగతి తెలుసుకొని గతనెల 30న రూ.3.50లక్షలు బ్యాంకులో జమచేసిందని, మిగతా రూ.4.13లక్షలు బ్యాంకులో జమచేయలేదని విచారణలో తేలింది. వీటిని గ్రామదీపిక నుంచి రెండురోజుల్లో రికవరీ చేస్తామని, ఆమెపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని డీఆర్‌డీవో అడిషనల్‌ పీడీ జయశ్రీ, స్త్రీనిధి రీజనల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు డ్వాక్రా మహిళలకు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం హరినారాయణ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-19T05:06:02+05:30 IST