తుని విశ్రాంత కమిషనర్‌పై విచారణ

ABN , First Publish Date - 2020-09-25T17:38:10+05:30 IST

తుని మునిసిపాలిటీలో 2007లో కమిషనర్‌గా పనిచేసిన పి.వెంకటేశ్వరరావు..

తుని విశ్రాంత కమిషనర్‌పై విచారణ

కాకినాడ: తుని మునిసిపాలిటీలో 2007లో కమిషనర్‌గా పనిచేసిన పి.వెంకటేశ్వరరావు, జూనియర్‌ అసిస్టెంట్‌ రాజేష్‌ చిన్నపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తుని మునిసిపాలిటీలో పని చేసిన కాలంలో వికలాంగ పెన్షన్‌లలో  అవకతవలకు పాల్పడినట్లు వారిపై అభియోగాలు ఉన్నాయి. తదనంతరం కమిషనర్‌ ఉద్యోగ విరమణ చేశారు. ఈ అభియోగాలపై విచారణ చేయడానికి మున్సిపల్‌ అడ్మినిసే్ట్రటివ్‌ రీజనల్‌ డైరెక్టర్‌ ఎస్‌.రవీంద్రబాబును విచారణాధికారిగా నియమించారు. ఈ మేరకు మున్సిపల్‌ పరిపాలనశాఖ జీవో జారీ చేసింది. 

Updated Date - 2020-09-25T17:38:10+05:30 IST