తెలంగాణ నూతన సచివాలయంపై ఎన్జీటీలో విచారణ

ABN , First Publish Date - 2022-02-23T01:00:39+05:30 IST

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణంపై ఎన్జీటీలో విచారణ

తెలంగాణ నూతన సచివాలయంపై ఎన్జీటీలో విచారణ

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణంపై ఎన్జీటీలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర పర్యావరణశాఖపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లైనా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో రూ.10 వేలు జరిమానా విధించింది. మార్చి 15లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఎన్జీటీ ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకపోతే సంబంధిత అధికారుల నుంచి జరిమానా వసూలు చేయాలంటూ ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణశాఖ తీరు ఇలాగే కొనసాగితే విచారణకి సంయుక్త కార్యదర్శి హాజరుకావాలని ఎన్జీటీ ఆదేశిస్తామని పేర్కొంది. పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయాన్ని కూల్చడం అక్రమమంటూ ఎన్జీటీని కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టుని పర్యావరణశాఖ తప్పుదోవ పట్టించిందని రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాది శ్రవణ్‌కుమార్ తెలిపారు. హైకోర్టుకి కేంద్రం తప్పుడు సమాచారమిచ్చిందని శ్రవణ్‌కుమార్ వాదించారు. హుస్సేన్‌సాగర్ పక్కనే సచివాలయం ఉన్నందున కేంద్ర పర్యావరణశాఖ అనుమతులివ్వాలని శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర పర్యావరణ కమిటీ అనుమతులు పొందడం అక్రమమని లాయర్ తెలిపారు. తదుపరి విచారణను మార్చి 15కి ఎన్జీటీ వాయిదా వేసింది. 

Updated Date - 2022-02-23T01:00:39+05:30 IST