వృద్ధురాలి మృతిపై విచారణ

ABN , First Publish Date - 2021-03-06T05:48:56+05:30 IST

హిరమండలం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో వృద్ధురాలు మృతి చెందిన ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలికి ఇక్కడ పీహెచ్‌సీలో సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వల్లే మృతి చెందిందనే ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపడుతున్నారు.

వృద్ధురాలి మృతిపై విచారణ

హిరమండలం, మార్చి 5: హిరమండలం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో వృద్ధురాలు మృతి చెందిన  ఘటనపై  అధికారులు విచారణ చేస్తున్నారు.  ఇటీవల  రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలికి  ఇక్కడ పీహెచ్‌సీలో సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వల్లే మృతి చెందిందనే ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని ఆధారంగా జిల్లా వైద్యాధికారి, ఐటీడీఏ పీవో  ఆదేశాల మేరకు సీతంపేట డెప్యూటీ డీఎంహెచ్‌వో ఎన్‌.రామిరెడ్డి శుక్రవారం ఆస్పత్రిని  సందర్శించారు. వైద్యాధికారి తబ్సమ్‌ అరాతో పాటు సిబ్బందిని ప్రశ్నించారు. ఆస్పత్రిలో ఎంత సమయం వరకు ఉన్నారు.. ఎంత సమయానికి గాయపడిన వృద్ధురాని తీసుకువచ్చారంటూ  విచారణ చేశారు.   నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు విచారణ అధికారి తెలిపారు.  అయితే..  ఈ విచారణ స్థానికుల  సమక్షంలో చేపట్టాలని పలువురు కోరుతున్నారు.  

Updated Date - 2021-03-06T05:48:56+05:30 IST