ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలపై విచారణ

ABN , First Publish Date - 2021-02-25T05:34:01+05:30 IST

ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన పలువురికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంపై మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో కరీంనగర్‌ జిల్లా ఎస్టీ డెవలప్‌మెం ట్‌ అధికారి గంగారాం బుధవారం విచారణ చేపట్టారు.

ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలపై విచారణ
ఎలిగేడు గ్రామంలో వియారణ చేపట్టిన ఎస్టీ డెవలప్‌మెంట్‌ అధికారి గంగారామ్‌

ఎలిగేడు, ఫిబ్రవరి 24 : ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన పలువురికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంపై మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో కరీంనగర్‌ జిల్లా ఎస్టీ డెవలప్‌మెం ట్‌ అధికారి గంగారాం బుధవారం విచారణ చేపట్టారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ఆరె, బొం దిల కులస్థులకు నక్కల కులస్థులుగా పేర్కొంటూ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సర్టిఫికెట్‌లు పొందిన వారినుంచి వివరాలు సేరించారు. ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు పొందిన వారందరూ తమవద్ద ఉన్న ఆధారాలతో మూడు రోజుల్లో అధికారుల ముందు మరోసారి హాజరుకావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి రంగారెడ్డి, సోషల్‌ వెల్పేర్‌ అధికారి లింగేశ్వర్‌, డిప్యూటీ తహీల్దార్‌ శ్రీనివాస్‌, రెవెన్యూ పరిశీలకులు శ్రీనివాస్‌, గ్రామ సర్పంచ్‌ సింధూజ, మాజీ సర్పంచ్‌ రాజనర్సయ్య, మాజీ ఎంపీటీసీ సత్యనారా యణ, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:34:01+05:30 IST