జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై ఎన్జీటీలో విచారణ

ABN , First Publish Date - 2022-03-08T02:04:30+05:30 IST

తెలంగాణలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై చెన్నై ఎన్జీటీలో

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై ఎన్జీటీలో విచారణ

ఢిల్లీ: తెలంగాణలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది.  బయోమైనింగ్ జరిపేందుకు నాలుగు నెలల సమయం కావాలని జీహెచ్‌ఎంసీ కోరింది. అయితే జీహెచ్‌ఎంసీ వాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. వెంటనే బయో మైనింగ్ ప్రారంభించాలని ఎన్జీటి ఆదేశించింది. 140 కోట్లు టాపింగ్ పెట్టడానికి బదులు బయో మైనింగ్‌కి పెట్టి ఉంటే పర్యావరణానికి బాగుండేదని ఎన్జీటి అభిప్రాయపడింది. బయో మైనింగ్ జరపకుండా జాప్యం చేస్తే భారీ జరిమానా విధించక తప్పదని ఎన్జీటి హెచ్చరించింది. జవహర్ నగర్ డంపింగ్ కారణంగా దుర్గంధం, జల కాలుష్యం, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఎన్జీటిని శంకర్ నారాయణ్, పద్మాచారి, హరివర్ధన్ రెడ్డి బృందం ఆశ్రహించింది. బయో మైనింగ్‌పై జీహెచ్ఎంసీ మార్చి 30వ తేదీలోగా నివేదిక అందించాలని చెన్నై ఎన్జీటి ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-03-08T02:04:30+05:30 IST