రైతు ఆత్మహత్యపై విచారణ
ABN , First Publish Date - 2021-10-15T06:43:49+05:30 IST
రైతు ఆత్మహత్యపై అధికారులు గ్రామా నికి వెళ్లి విచారణ చేపట్టారు.
తనకల్లు, అక్టోబరు 14: రైతు ఆత్మహత్యపై అధికారులు గ్రామా నికి వెళ్లి విచారణ చేపట్టారు. మం డలంలోని వడ్డిపల్లి గ్రామంలో రెండు నెలల క్రితం మహ దేవ (52) అనే రైతు అప్పుల బాధ తాళ లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై కదిరి ఆర్డీఓ వెంకట రెడ్డి, డీఎస్పీ భవ్యకిశోర్, ఏడీఏ సత్య నారాయణ గురువారం గ్రామానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు... అప్పులు ఎన్ని ఉన్నాయి.. వ్యవసాయ వివరాలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, ఆర్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.