పెట్రో ధరల పెంపుపై వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-01-24T05:30:00+05:30 IST
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపును నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం వినూత్నంగా నిరసన చేపట్టారు.
బొబ్బిలి: పెట్రోల్, డీజిల్ ధరలు పెంపును నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం వినూత్నంగా నిరసన చేపట్టారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో సీఐటీయూ నాయకుడు పొట్నూరు శంకరరావు ఆధ్వర్యంలో ఆటో వర్కర్లంతా మోకాళ్లపై నిల్చొని ప్రధానమంత్రి మోదీకి నమస్కరిస్తూ... పెట్రో ధరలు పెంపు తో సామాన్యులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ధరల పెంపుదల ను అరికట్టాలని ప్రాధేయపడ్డారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ సమాజంలో ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరిపైనా అనేక రకాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారం మోపుతున్నాయని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోనికి వచ్చాక తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.