రోడ్డు మరమ్మతుకు వినూత్న నిరసన

ABN , First Publish Date - 2020-08-03T10:13:10+05:30 IST

మండలంలోని తిమ్మాపూర్‌-చేగూర్‌ రహదారి బురదమయంగా మారింది. దీంతో ఆదివారం తిమ్మాపూర్‌ గ్రామస్థులు రోడ్డుపై ఉన్న వర్షపు నీటిలో వరినాట్లు వేసి

రోడ్డు మరమ్మతుకు వినూత్న నిరసన

కొత్తూర్‌: మండలంలోని తిమ్మాపూర్‌-చేగూర్‌ రహదారి బురదమయంగా మారింది. దీంతో ఆదివారం తిమ్మాపూర్‌ గ్రామస్థులు రోడ్డుపై ఉన్న వర్షపు నీటిలో వరినాట్లు వేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు తెలిపారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-08-03T10:13:10+05:30 IST